రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో బ్రహ్మ శ్రీ డా. గౌరిభట్ల రఘురామ శర్మ గారి అష్టావధాన కార్యక్రమం
ప్రపంచ తెలుగు మహాసభల కారణంగా తెలంగాణలో ఉన్న కవులు, పండితులు, కళాకారులు వేదిక పైకి వస్తున్నారు: దేశపతి శ్రీనివాస్
ఈరోజు 28.12.2017 న ఉదయం 11:00 గం.లకు రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశమందిరంలో తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో బ్రహ్మ శ్రీ డా. గౌరిభట్ల రఘురామ శర్మ గారి అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో… ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సభాధ్యక్షత వహించగా, బ్రహ్మ శ్రీ డా. గౌరిభట్ల రఘురామ శర్మ గారు అవధానం నిర్వహించారు.
అష్టావధానం పృచ్చకులు:
1) సమస్య : శ్రీమతి బి. వేదవతి
2) అంత్యక్షరి : శ్రీమతి వేలేటి శైలజ
3) వ్యత్యస్త పాది : శ్రీ వి. ఫణీంద్ర శర్మ
4) దత్తపది : శ్రీ పండరి రాధాకృష్ణ
5) వర్ణన : శ్రీ అష్టకాల విద్యాచరణ్ శర్మ
6) నిషిద్దాక్షరి : శ్రీ భవానీ జగదీశ్వర్ రెడ్డి
7) అశువు : శ్రీ ఎ. శ్యాంమోహన్ శర్మ
8) అప్రస్తుత ప్రసంగం : శ్రీ సాకేత్ ప్రవీణా చర్య
వీరంతా కార్యక్రమంలో అష్టావధాన పృచ్చకులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో దేశపతి గారు మాట్లాడుతూ… ఈరోజు జరిగిన అష్టావధాన కార్యక్రమం గొప్పగా రూపు దిద్దుకొంది అని, తెలంగాణ ద్వర్తి కావ్యం రచించిన కవులు, శతావధానం చేసిన పండితులు ఎందరో ఉన్నారు కానీ, కొన్ని కారణాల వల్ల తెలంగాణలో ఎక్కువగా మన పండితులు ప్రాచుర్యంలోకి రాలేదని అన్నారు.
మన గౌ. ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల కారణంగా తెలంగాణలో ఉన్న కవులు, పండితులు, కళాకారులు వేదిక పైకి వస్తున్నారని అన్నారు. వంశ పరంపరగా వస్తున్న అవధాని గౌరిభట్ల రఘురామ శర్మ గారిని అభినందించారు.
కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… అవధానం చేయటం గొప్ప విషయమని, అష్టావధానం, శతావధానం, దశ సహస్రావధానం, గొప్ప ధారణ, గొప్ప విద్య, మన భారతీయ ఆత్మ అవధానమని, ఎన్నో వేల యేండ్ల నుంచి అవధానం ఉందన్నారు. పద్యం, అవధానం, తెలుగు భాష అని, అష్టావధానంలో 8 అంశాలుంటాయని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల గూర్చి ప్రస్తావిస్తూ తరతరాల నుంచి వస్తున్న అవధాన ప్రక్రియ ఇది అని అన్నారు. పద్యం, తెలుగు బాష, అవధానం, అష్టావధానం గూర్చి అద్భుతంగా వివరించారు.
వేదవతి గారు చెప్పిన సమస్య “జతపమాచరించి” మొదటి పాదంతో ప్రారంభమై, దత్తపది రాధాకృష్ణ గారు నిరాకారం, ఆకారం, మమకారం, శ్రీకారం తెలంగాణ అంశం పై వివరణ కోరారు. నిషిద్ధాక్షరి జగదీశ్వర్ గారు తెలుగు పద్యం భాషకు కలకాలం వర్ధిల్లాలని కోరారు.
పృచ్చకులు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతిని అవధాని రఘురామ శర్మగారు గణపతి ప్రార్థనతో ప్రారంభించి అవధానం చక్కగా అభివర్ణించారు.