తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అన్ని రాష్ట్రాల వర్గాల కళాకారుల కళారూపాలను ప్రోత్సహిస్తూ వస్తుంది – మంత్రి శ్రీనివాస్ గౌడ్; రవీంద్రభారతిలో మూడు రోజులపాటు జరిగే సాంస్కృతిక ఉత్సవాలను పురస్కరించుకుని మొదటిరోజు పేరని కూచిపూడి ఉద్యమ ప్రస్థానం తెలియజేసే జయ జయహే తెలంగాణ నృత్య రూపకాన్ని ప్రారంభించిన మంత్రి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మూడు రోజులపాటు జరిగే సాంస్కృతిక ఉత్సవాలను రాష్ట్ర అబ్కారీ,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల సంస్కృతి కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు పేరని కూచిపూడి ఉద్యమ ప్రస్థానం తెలియజేసే జయ జయహే తెలంగాణ నృత్య రూపకాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అన్ని రాష్ట్రాల వర్గాల కళాకారుల కళారూపాలను ప్రోత్సహిస్తూ వస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఒకప్పుడు కూచిపూడి భరతనాట్యం మాత్రమే ఆదరణకు నోచుకున్నాయి. తెలంగాణ కళారూపాలు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మరుగున పడిన తెలంగాణ ప్రాచీన కళలు ఒగ్గు కథ పేరని వంటి కళారూపాలను ముందుకు తీసుకువచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కూచిపూడి భరతనాట్యం తోపాటు కాకతీయుల కాలం నుండి ఆదరణ పొందిన పెరణి నృత్యం ను కూడా రాబోయే కాలంలో లో మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కళాకారులను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బంగారు తెలంగాణ నిర్మాణం లో కళాకారులు తమ సహకారం అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.