భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి: “సినివారం”లో రేపు “మౌనగీతం”, “ఇండియన్ ఫార్మర్” , “అ ఆ తో అందరం” మొదలగు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శన
భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న “సినివారం”లో రేపు పలు లఘుచిత్రాలు/డాక్యుమెంటరిలు/ఫీచర్ ఫిల్మ్స్ ఉచితంగా స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు
1) శ్రీ పి. దుర్గాప్రసాద్ గారి రచన, దర్శకత్వంలో రూపొందిన “మౌనగీతం” లఘు చిత్రం ప్రదర్శన ఉంటుంది. ప్రేమకథా చిత్రమిది.
2) శ్రీ పవన్ శంకర్ గారి రచన, దర్శకత్వంలో రూపొందించిన “ఇండియన్ ఫార్మర్” షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ఉంటుంది. దేశంలో ఇంతకు ముందు, ప్రస్తుతం రైతుల పరిస్థితి, వారెదుర్కొంటున్న సమస్యలు, రైతుల ఆత్మహత్యలు వంటి కథాంశంతో రూపొందించిన లఘు చిత్రమిది.
3) శ్రీ అశోక్ బుసగల్ల గారి దర్శకత్వంలో రూపొందిన “అ ఆ తో అందరం” సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన చయనున్నాం.
ఈ కార్యక్రమంలో సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత, నటీనటులు అలాగే సినిమా సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రేమికులు పలువురు పాల్గొననున్నారు.