ఈ “సినివారం” లో “సహేలి”, “రంగ్ దేవా”,“ఫాలింగ్ ఇన్ లవ్” అనే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన, మరియు సినిమా పాటల మహిళా రచయిత్రి శ్రేష్ట గారితో ముఖాముఖీ కార్యక్రమం, “గుస్సాడి” డాక్యుమెంటరీ టీజర్ లాంచ్
తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న “సినివారం”. ప్రతీ శనివారం షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శన. ఈ కార్యక్రమం రేపు 3:00 గం.ల నుంచి 9:00 గం.ల వరకు.
ఆర్యన్ రచన, దర్శకత్వంలో, విజయ్ కుమార్ బచ్చు నిర్మాణంలో రూపొందించిన “సహేలి” అనే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన రేపు మద్యాహ్నం 3:00 గంటలకు రవీంధ్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. అనుకోకుండా 100 రూపాయల నోట్ ద్వారా కలిసిన ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య జరిగిన ప్రేమ కథా చిత్రం ఇది.
తెలుగు సినిమాలకు పాటలు రాసిన అతి తక్కువ మహిళా రచయిత్రుల్లో ఒకరు శ్రేష్ట గారు. తెలంగాణలో తొలి తెలుగు పాటల రచయిత్రి అయిన శ్రేష్ట గారు “ఒక రొమాంటిక్ క్రైమ్ కథ”, “కో అంటే కోటి”, “పెళ్లి చూపులు”, “అర్జున్ రెడ్డి”, “యుద్ధం శరణం” వంటి పెద్ద సినిమాలకు పాటలు రాసిన రచయిత్రి. వారు రేపు టాక్ ఎట్ సినివారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి అనుభవాలను సినివారం ప్రేక్షకులతో పంచుకోనున్నారు.
అలాగే…ఇటీవల “ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ – 2017” నిర్వహించిన పోటీల్లో 19 దేశాలు, 292 నగరాల నుంచి, 1503 షార్ట్ ఫిల్మ్స్, 29000 ఎంట్రీల్లో విజేతగా నిలిచిన 2 తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన.
హరికాంత్ గుణమాగరి దర్శకత్వంలో, విన్సెంట్ ప్రవీణ్ నిర్మాణంలో రూపొందిన “రంగ్ దేవా” మరియు వారాల అన్వేష్ దర్శకత్వంలో రూపొందిన ఫాలింగ్ ఇన్ లవ్ (వెడ్డింగ్ ఫిల్మ్) షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన చేయనున్నాం. అలాగే పూర్ణ చందర్ బాదావత్ రచన, దర్శకత్వంలో రూపొందిన “గుస్సాడి” డాక్యుమెంటరీ టీజర్ లాంచ్ చేయనున్నారు.
ప్రదర్శన అనంతరం ఆయా చిత్ర బృందాలతో ముఖాముఖి.