సాంస్కృతిక శాఖ: రవీంద్రభారతి ప్రధాన ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు -సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
ఇవాళ్టి కార్యక్రమం రవీంద్రభారతి ప్రధాన ప్రాంగణంలో..
1) హర్షిణి భూపతిరాజు గారిచే కూచిపూడి నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా,
2) దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు “బతుకమ్మ నృత్యరూపకం”ను Dr. కోట్ల హనుమంతరావు గారి రచనలో, Dr. అనితారావు దర్శకత్వంలో రూపొందిన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా… కార్యక్రమంలో… సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, బతుకమ్మ ఉత్సవాల నేపథ్యం గూర్చి తెలిపారు.
ఈ కార్యక్రమంలో, INTAC స్టేట్ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు, తిలక్ నగర్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి గారు, ప్రముఖ సినీ దర్శకులు సంకల్ప్ రెడ్డి గారు, అంతర్జాతీయ మైఁ కళాకారుడు మైఁ మధు, త్రిపుర నుంచి వచ్చిన ట్రైబల్ మరియు ఫోక్లోర్ సొసైటీ, సోనా చరణ్, ప్రముఖ సినీనటుడు టార్జాన్, తదితరులు పాల్గొన్నారు.
రేపు కార్యక్రమంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రదర్శనని శ్రీమతి దీప్తి రెడ్డి గారి బృందం ప్రదర్శన చేస్తారు.