భాషా సాంస్కృతిక శాఖ: రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాలకు తెలంగాణ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల/పాఠశాలల 5 మంది అధ్యాపకులు ఎంపిక: మామిడి హరికృష్ణ
జాతీయ ఉపాద్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ యేట ప్రతిష్టాత్మకంగా ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాలను అందచేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల మరియు పాఠశాలలలో వివిధ కళారూపాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 మంది అధ్యాపకులకు 2018 సంవత్సరంలో ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాలను ఈరోజు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి, శ్రీ మహమూద్ అలీ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పురస్కారాలను అందచేశారు. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ ఉపాధ్యాయులందరికి అభినందనలు తెలిపారు.
1. శ్రీ పాండు రంగ్ ముతాలిక్ – సితార్ – శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాద్.
2. శ్రీ డి. జయకుమార్ ఆచార్య – మృదంగం – అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్
3. శ్రీమతి జి. లావణ్య లత – కర్ణాటిక్ ఓకల్ – శ్రీ త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రామకోఠి.
4. శ్రీ జె. శ్రీనివాస మూర్తి – కర్ణాటిక్ వయోలిన్ – విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, వరంగల్
5. శ్రీ ఎం. నర్సయ్య – కూచిపూడి నృత్యం – ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, మంథని.