తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ 19-Aug-2017: సినిమా రంగంలో తెలంగాణ నేల కీర్తిని పెంచాలి – కొత్త దర్శకులు సామాజిక స్పూర్తితో కథలను అల్లుకోవాలి: దేశపతి శ్రీనివాస్
భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఈ రోజు “సినివారం”లో
1) శ్రీ పూర్ణ చందర్ దర్శకత్వంలో రూపొందిన “రాచకొండ చరిత్ర” డాక్యుమెంటరీ ట్రైలర్ లాంచ్ చేసారు. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ సమీపంలో కడీలబాయ్ తండా సమీపంలో అద్భుతమైన రాతి నిర్మాణాలు, ఎత్తైన కొండలు ఉంటాయి. రాచకొండ గుట్టల చరిత్రని డాక్యుమెంటరీగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ట్రైలర్ C.D.ని CM OSD శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని లాంచ్ చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినిమా నటులు వైభవ్ సూర్య, రోషం బాలు, రాచకొండ డాక్యుమెంటరీ దర్శకులు పూర్ణచందర్, సర్పంచ్ సాగర్ నాయక్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సతీష్ నిమ్మల, టీం, తదీతరులు పాల్గొన్నారు.
2) ముంబయి ప్రాంతంలో స్థిరపడిన మన తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ కుమార్ గిరి గారి దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ “దేవగిరి ఎక్స్ ప్రెస్” సినిమాకి సంబందించిన ట్రైలర్ లాంచ్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ముంబయి వలస వెళ్ళిన ప్రజలు కర్మ భూమికే కాకుండా కన్న భూమికి ఎంతో ఋణపడి ఉన్నామని భావనతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు పబ్బాలు వాటిని అక్కడ జరుపుకుంటు మన తెలంగాణ సంస్కృతిని కాపాడే ప్రయత్నమే ఈ షార్ట్ ఫిల్మ్.
3) శ్రీ శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందిన “భవిత” షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన జరిగింది. సందేశాత్మక కథనంతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆలోచింపచేసింది.
4) మై డ్రీమ్స్ ప్రొడక్షన్స్ లో శ్రీ లక్ష్మణ్ రేపాక దర్శకత్వంలో రూపొందిన “ఓ మై లవ్” షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన చేశాం. “Live For Ever” అనే ఇతి వృత్తంతో తీసిన ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ దేశపతి గారు మాట్లాడుతూ… సినిమా రంగంలో సినిమా కీర్తిని పెంచాలని, సంస్కృతి, సామాజిక ఇతివృత్తం వంటి వాటి పై అవగాహనతో సినిమా ఉండాలని, టెక్నికల్ సాధన బాగుందని, కెమెరా ఇతర టెక్నికల్ వర్క్ తో పాటు డాక్యుమెంటరీ ఎలా తీస్తున్నారో ఆ కథాంశం పై పరిశోధన అవగాహనతో సినిమా తీస్తే ఇంకా అద్భుతమైన సినిమాలు వస్తాయని దీనికోసం యువ దర్శకులు పుస్తక పఠనం, విషయ అధ్యయనం మరింత చేయాలని అన్నారు. భవిష్యత్తులో సినిమా రంగానికి కూడా రవీంధ్రభారతి కూడా ఒక వేదిక అవుతుంది అని హరికృష్ణ గారిని అభినందించారు.
అలాగే ఈరోజు డాక్యుమెంటరీల పై మాట్లాడుతూ రాచకొండ చూస్తుంటే ఆనకొండ సినిమా గుర్తుకు వస్తుందని, దర్శకులు పూర్ణ పూర్ణత్వం సాధించాలని అన్నారు. ముంబయి నిర్మాణంలో తెలుగువారి పాత్ర బాగా ఉందని గుర్తు చేస్తూ, దేవగిరి ఎక్స్ ప్రెస్ సినిమా టీం వారు మన సంస్కృతి పై సినిమా తీయటం గొప్ప ఆలోచన అని అభినందించారు. సినిమా బృందాల వారిని ప్రోత్సహిస్తూ, అభినందిస్తూ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముంబయి నుంచి వచ్చిన దర్శకులు నితిన్ కుమార్, నవీన్, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత, నటీనటులు, అలాగే సినిమా సాంకేతిక నిపుణులు, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రేమికులు, సినివారంటీం పలువురు పాల్గొన్నారు.