శ్రీ గురు నృత్యాలయం శ్రీమతి లక్ష్మి నల్లమోలు గారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి
వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా శిల్పారామం లోని ఆంఫీ థియేటర్ లో శ్రీ గురు నృత్యాలయం శ్రీమతి లక్ష్మి నల్లమోలు గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే కర్ణాటక గాత్ర కచేరి మరియు కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి.
మొదటగా శ్రీ గురు నృత్యాలయం శిష్య బృందం అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. తరువాత కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు. గణపతికాతం, బ్రహ్మాంజలి, వినరో భాగ్యము, ఇందరికి భయము, శ్లోకం, జఠస్వరం, జెమ్ జింతన, దశావతారాలు, వేడుకొందామ, సిరుత నవ్వులవాడు సిన్నక్క, తందనానాహరి, తిరువీధులవెలసెను మొదలైన అంశాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆద్య, వేశ్వర్య, అనూష, అష్మిత, ఆశ్రీత, భవ్య, గగన, హరిప్రియ, హర్పిత, జిమ మొదలైన కళాకారులు పాల్గొన్నారు.