తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: ఎంపి కవిత
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని, ఈ సారి నిర్వహించే బతుకమ్మ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని జాగృతి వ్యవస్థాపకురాలు కవిత గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ సంబరాల వాల్ ఫోస్టర్ ను నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.. బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు రాగం సుజాత యాదవ్ తెలిపారు. నాంపల్లి గగన్ విహార్ లో ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు కార్యాలయం ఆవరణలో ఈ నెల 21న పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోస్టర్ ఆవిష్కరణలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బోర్డు కార్యదర్శి జయశ్రీ, సిబ్బంది ప్రశాంతి, సత్యనారాయణ రావు, వకులా కుమారి, సువర్ణ తో పాటు ముప్పిడి గోపాల్ తదితరులు ఉన్నారు.