ప్రపంచ తెలుగు మహాసభల పురస్కరించుకొని 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సందర్భంగా తెలుగు భాషా ప్రచార సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కి శుభాభినందనలు తెలుపుతూ గోడ పత్రిక ఆవిష్కరణ
జాతి ప్రగతికి మాతృభాషలో భోధన, ప్రజల భాషలో పాలన తప్పనిసరి చేయాలని, మా తెలుగు భాషా ప్రచార సమితి కార్యవర్గం విన్నపాన్ని మన్నించి, వచ్చే 2018 -2019 విద్యా సంవత్సరము నుండి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తామని తెలుగు మహాసభల సందర్భంగా ప్రకటించిన గొప్ప సాహసి అత్యంత గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు గారికి సమస్త తెలుగు ప్రజల తరపున జోహార్లు తెలుపుతూ ఈ రోజా అశోక్ నగర్ గ్రంధాలయంలో బెలిదె వీర సంకరు అధ్యక్షతన గోడ పత్రిక బ్రోచర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు భాషా ప్రచార సమితి ప్రతినిధులు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి, బీ వీర సంకరు, సీజే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.