అత్యంత వైభవంగా జరిగిన ” శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్య ” వారి 610వ జయంతి ఉత్సవాలు – శిల్పారామం హైదరాబాద్ మరియు శృతి మ్యూజిక్ అకాడమి వారు సంయుక్త సౌజన్యంతో 116 మంది కళాకారులు అన్నమాచార్యుల సంకీర్తనలను గానం చేసారు
శిల్పారామం హైదరాబాద్ మరియు శృతి మ్యూజిక్ అకాడమి వారు సంయుక్త సౌజన్యంతో ” శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్య ” వారి 610వ జయంతి ఉత్సవాలను శిల్పారామం ఆంఫీ థియేటర్ లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 116 మంది సంగీత కళాకారులు తమ గాత్రంతో అన్నమాచార్యుల సంకీర్తనలను గానం చేసి ఆ వెంకటేశ్వరస్వామికి అర్పించారు.
శ్రీమతి వసుధా మూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ జి. లక్ష్మణ మూర్తి మరియు కుమారి జి. నందిని గారిచే సామూహిక అన్నమయ్య సంకీర్తనలను 116 మంది కళాకారులు గానం చేసారు. కీబోర్డుపై కుమారి జి. యామిని, తబలా పై అనిరుద్ శర్మలు సహకరించారు.
బ్రహ్మకడిగిన పాదం, అదిగో అల్లదిగో, ముద్దు గారే యశోద, విన్నపాలు వినవలె, ఏ పురముల ఎంత వెతికిన, ఎటుకుడే పెళ్లి యోగము, ఎత్తరే ఆరుతులితే, ఎన్నటి వారలు నెవ్వరు, అలరు చెంచలమైన, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, భావయామి గోపాలాభాలం, బావములోన భాష్యమునందును, చాలాదా పురినామ, చక్కని తల్లికి టాంగుబళా, చెలియశోదకు శిశువితడు, దేవదేవంభజే, డోలాయాలాచల డోలాయాం మొదలైన సంకీర్తనలను గానం చేసారు.