తెలుగు భాషకు, సాహిత్యానికి వన్నె తెచ్చిన ఆకాశవాణి
భాషను కాపాడుకోవలసిన అవసరం ఈనాటి ప్రధాన కర్తవ్యమని “ తెలుగు భాషా సాహిత్య సేవలో ఆకాశవాణి” రెండు రోజుల సదస్సు ముగింపు సభలో పాల్గొన్న ముఖ్య అతిథి డా. కె.వి. రమణాచారి ఎంతో ఉద్వేగంతో పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం నాడు ఈ సదస్సు జరగడం ముదావహమని అంటూ ఆకాశవాణితో తమ 30 ఏళ్ళ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఈ సభకు అధ్య్క్షత వహించిన సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం అధ్యక్షులు ఆచార్య ఎన్. గోపి అభివృధ్ధి పేరుతో భాషను బలి చేయకూడదని విజ్ఞప్తి చేశారు. భాషా పరిరక్షణకు ప్రభుత్వాలు, ఆకాశవాణి గట్టి కృషి చేస్తూనే ఉండాలన్నారు.a
సాహిత్య అకాడెమీ, ఆకాశవాణి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో పదహారు మంది ప్రసార ప్రముఖులు పత్ర సమర్పణ చేశారు. మహిళా చైతన్య కార్యక్రమాల గురించి ప్రయాగ వేదవతి, రేడియోలో హాస్యం గుర్న్చి పి. ఎస్. భట్, రేడియో భక్తి సాహిత్యానికి, హరికథ, యక్షగానాలకు కల్పించిన ప్రచారం గురించి మల్లాది సూరిబాబు, వ్యవసాయ కార్యక్రమాలలో ప్రజల భాష గురించి జి. విజయ కుమార్, రేడియోలో లలిత సంగీతం గురించి కలగా కృష్ణమోహన్, రేడియోలో సైన్సు కార్యక్రమాల గురించి కె.బి. గోపాలం, బాలసాహిత్యానికి రేడియో చేసిన సేవ గురించి మంజులూరి కృష్ణకుమారి, రేడియోలో వార్తారచన గురించి సమ్మెట నాగమల్లేశ్వరరావు పత్రాలు సమర్పించారు. ఈ పత్రాలను త్వరలో పుస్తక రూపంలో తెస్తుందని ఎన్. గోపి అన్నారు.
రెండు రోజుల సదస్సును విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సహాయ సంచాలకులు వి. ఉదయ్ శంకర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సదస్సులు ఆకాశవాణికి, శ్రోతలకు మరింత సాన్నిహిత్యాన్ని పెంచుతాయని అన్నారు. వంద హాస్య నాటికలు రికార్డు చేయాలన్నది ఆకాశవాణి సంకల్పమని అన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు సి. ఎస్. రాంబాబు వందన సమర్పణ చేశారు.
అనంతరం సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలొ కవి సంధ్య కార్యక్రమంలో ప్ర్ముహ్ కవి సుధా పాల్గొన్నారు.