గురువుకు పాదాభివందనం – మహాసభల ప్రారంభంలో సీఎం తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మను సత్కరించారు
మహాసభల ప్రారంభంలో సీఎం తన చిన్ననాటి గురువు బ్రహ్మశ్రీ మృత్యుంజయశర్మను సత్కరించారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం తిలకం దిద్ది, గంధం పూసి, అత్తరు చల్లి, శాలువాకప్పి పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి సత్ప్రవర్తనకు, నడవడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మురిసిపోయారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ విలువలకు నిదర్శనంగా ఉన్నందునే ప్రపంచ తెలుగు మహాసభలు అనే గొప్ప ఉత్సవాన్ని నిర్వహించగలుగుతున్నారని చెప్పారు.