శిల్పారామంలో ఘనంగా ముగిసిన మూడు రోజుల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
మూడు రోజుల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎంతో ఘనంగా శిల్పారామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ముగింపు ఉత్సవాలలో భాగంగా దాదాపు 150 మంది కళాకారులు పాల్గొని ముగింపు ఉత్సవాలను జయప్రదం చేసారు.
నృత్య కిన్నెర శ్రీమతి ముద్దాలి ఉషా గాయత్రి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన అలరించింది. వనజాక్షి మెరుగువంటిది అలిమేలుమంగ, ఎహిమురారే, నమశ్శివాయతే, స్వాగతం కృష్ణ, నీ సంకల్పం వంటి అంశాలను శ్రీమతి ముద్దాలి సౌందర్య శ్రద్ధ, సుప్రియలు ప్రదర్శించారు.
శ్రీమతి పూర్ణిమ బాలసుబ్రమణ్యం గారి బృందం చెన్నై నుండి విచ్చేసిన మన శిల్పారామంలో నృత్యప్రదర్శన ఇచ్చారు. తాడయ మంగళం, రామవర్ణం, మహాదేవ శివశంబో, బ్రహ్మం ఒక్కటే అంశాలను భరతనాట్య శైలిలో ప్రదర్శించారు.
శ్రీమతి మాతంగి కవిత బృందం లంబాడి నృత్యం, శ్రీ ఈశ్వర్ బృందం మాధరీ నృత్యం, శ్రీ అరిగయ్య బృందం, శ్రీ నాగరాజు బృందం, తప్పెటగుళ్లు, శ్రీ కోటశ్రీనివాస రావు బృందం గరగళ్ళు, శ్రీమతి ఆశాలత బృందం, అప్పన్న మరియు తిరువాతిరల్కళి, శ్రీ ఆదిశివం బృందం తప్పటం మరియు ఓయిలాట్టం జానపద నృత్యాలను ప్రదర్శించారు.
కళాకారులందరికి సన్మానం, ప్రశంసాపత్రాలను అందజేశారు.
3rd Day PROGRAMS SCHEDULE: 3-JUNE-2018
3 | 3.6.2018Sunday | · Nrutya Kinnera Dance Institute-, Hyderabad- Kuchipudi· Sri Chandra Mudhra School for Bharatnatyam, Chennai- Bharatnatyam
· A. Mathangi Kavitha from Telangana- Lambadi · C. Adisivan from Tamil Nadu- Thappatam & Oyilaattam · Sri Ippili Nagaraju from Andhra Pradesh- Thappetagullu · Sri M. Lingaiah from Karnataka – Beesu Kamsale · Ms. Ashalata KP Kochunivas from Kerala- Oppanna & Thiruvathiralkali · Sri A. Eshwar from Telangana – Mathuri & Dhimsa · Sri Kota Srinivasa Rao from Andhra Pradesh- Garagalu |