జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ హోం ను సందర్శించింది. వివిధ రాష్టాలకు చెందిన 102 మంది వలస కార్మికులకు ఇక్కడ కల్పించిన వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కింగ్ కోటి ఆసుపత్రి ని కేంద్ర బృందం తనిఖీ చేసింది.