దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు ప్రారంభం – మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు అందరికి ఆదర్శం – ముఖ్య అతిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి
ఈరోజు రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) నిర్వాహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” ప్రారంభమయ్యాయి.
సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి విచ్చేసి జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించారు. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడిని, అయన అందరికి ఆదర్శమని ముఖ్య అతిధి ఎస్ కె జోషి అన్నారు.
అనంతరం శ్రీమాన్ రామానుజదాస స్వామి సుందరకాండ ప్రవచనాలు చేసారు. సుందరకాండ విశిష్టతను తెలియచేసారు.
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డా. మాడుగుల నాగఫణి శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య, దివ్యజ్ఞాన సిద్ధాంతి, చిలుకూరు బాలాజీ దేవాలయం శ్రీ రంగరాజన్ దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం (ఏప్రిల్ 22) నుండి బుధవారం (ఏప్రిల్ 24) – మూడు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 5-30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ సుందరకాండ ప్రవచనాలు కార్యక్రమానికి భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
Contents
దర్శనమ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సుందరకాండ ప్రవచనాలు ప్రారంభం – మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడు అందరికి ఆదర్శం – ముఖ్య అతిధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిఈరోజు రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆద్వర్యంలో కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి) నెలకొల్పిన శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం (అంగలకుదురు) నిర్వాహకులు శ్రీమాన్ రామానుజదాస స్వామి వారిచే ” సుందరకాండ ప్రవచనములు ” ప్రారంభమయ్యాయి.సోమవారం నుండి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి విచ్చేసి జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించారు. మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడిని, అయన అందరికి ఆదర్శమని ముఖ్య అతిధి ఎస్ కె జోషి అన్నారు.అనంతరం శ్రీమాన్ రామానుజదాస స్వామి సుందరకాండ ప్రవచనాలు చేసారు. సుందరకాండ విశిష్టతను తెలియచేసారు.భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డా. మాడుగుల నాగఫణి శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ఆధ్యాత్మికవేత్త సీతారామయ్య, దివ్యజ్ఞాన సిద్ధాంతి, చిలుకూరు బాలాజీ దేవాలయం శ్రీ రంగరాజన్ దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.సోమవారం (ఏప్రిల్ 22) నుండి బుధవారం (ఏప్రిల్ 24) – మూడు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 5-30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ సుందరకాండ ప్రవచనాలు కార్యక్రమానికి భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.