రైతు సమగ్ర సమాచార సేకరణ పై సి. పార్ధసారధి దూరదృశ్య సమీక్ష
రైతు సమగ్ర సమాచార సేకరణ మరియు ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు వడగళ్ళ వానతో జరిగిన పంట నష్టం పై నిర్వహించిన దూరదృశ్య సమీక్ష
ఈ రోజు 22.04.2019న రైతు సమగ్ర సమాచార సేకరణపై సి. పార్ధసారధి IAS, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ మరియు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి జిల్లా మరియు మండల వ్యవసాయ మరియు ఉద్యాన అధికారులతో దూరదృశ్య సమీక్షను నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో రాహుల్ బొజ్జ IAS, వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎల్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు మరియు రాష్ట్ర స్థాయి వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.
ఈ సమీక్షలో సి. పార్ధసారధి IAS రైతు సమగ్ర సమాచార సేకరణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సేకరించే ఈ సమగ్ర సమాచారం ప్రతి రైతు పొలంలో పండిస్తున్న పంటల వివరాలను ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ పథకాలలో ఆన్ లైన్ రాయితీ బదిలీకు, పంటల కనీస మద్దతు ధర నిర్ణయించడానికి, రైతులకు అవసరమైన ఇన్ పుట్స్ (విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ పనిముట్లు) సరఫరాకై ప్రణాళికను రూపొందించటం మొదలైన వాటికి ఆధారంగా తీసుకోబడుతుందని తెలియచేయడం జరిగింది.
కాబట్టి ఖచ్చితమైన సమాచారాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ/ఉద్యాన అధికారి ప్రతి రైతు నుండి వారు పండిస్తున్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు మరియు ఇతర పంటల గురించి సమగ్రమైన సమాచారాన్ని ప్రతి సర్వే నెంబర్ వారీగా సేకరించవసినదిగా ఆదేశించడమైనది. ఈ సమాచారాన్ని పొందుపరుచుటకై రూపొందించిన 44 కాలమ్స్ కలిగిన నమూనా పత్రం (ప్రోఫార్మా)ను గురించి విపులంగా వివరించడం జరిగింది.
ఈ నమూనా పత్రంలో 15 కాలమ్స్ లో ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని నింపవలసి ఉంటుందని అలాగే, ఇంటి వద్ద ఉన్న పండ్ల చెట్ల మరియు కూరగాయల వివరాలు మరియు పొలం గట్ల మీద ఉన్న చెట్ల వివరాలను కూడా సేకరించవలసినదిగా ఆదేశించడం జరిగింది.
జిల్లా వ్యవసాయ & ఉద్యాన అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మండల వ్యవసాయ అధికారులకు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా రైతు సమగ్ర సమాచారాన్ని సేకరణలో తోడ్పాటును ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది. అలాగే ఈ సమగ్ర సమాచార సేకరణను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి వ్యవసాయ మరియు ఉద్యాన ఉన్నతాధికారులను జిల్లాలకు పర్యవేక్షక అధికారులుగా నియమించడం జరిగిందని తెలియచేయడమైనది..
అంతేకాకుండా ప్రతి రోజు సేకరించిన రైతుల సమాచారంపై నివేధికను జిల్లా వ్యవసాయ / ఉద్యాన అధికారి ఆన్ లైన్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ/ఉద్యాన సంచాలకుల కార్యాలయానికి పంపించ వలసినదిగా కొరడమైనది.
అలాగే ఈ రైతు సమగ్ర సమాచార సేకరణను మే 20వ తేది వరకు పూర్తి చేయవలసినదిగా కొరడమైనది.
తరువాత, గత వారం నుండి కురిసిన అకాల వర్షాలు మరియు వడగళ్ళ వానకు వ్యవసాయ మరియు ఉద్యాన పంటలకు జరిగిన భారీ నష్టంపై అధికారులతో చర్చించడం జరిగింది. పంట నష్టపోయిన రైతుల వివరాలను యుద్ధ ప్రతిపాదికన సేకరించి సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయాలకు పంపవలసినదిగా ఆదేశించడమైనది.