ఏ భేదం లేకుండా ప్రేమించే గుణం ఈ భూమిపైన తల్లికి మాత్రమే ఉంటుంది, అటు తరువాత వైద్య వృత్తిలో ఉన్న నర్సులకు మాత్రమే సాధ్యం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
రవీంద్రభారతిలో ఘనంగా నర్సస్ డే వేడుకలు
అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కిన రోగికి వైద్య సేవ కంటే నర్సులు చూపించే ప్రేమ, ఆప్యాయతలే రోగిని బాబు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంఘ సేవకి ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 జయంతి పురస్కరించుకొని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ నర్సస్ డే ) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ..ఏ భేదం లేకుండా ప్రేమించే గుణం ఈ భూమిపైన తల్లికి మాత్రమే ఉంటుందని, అటు తరువాత వైద్య వృత్తిలో ఉన్న నర్సులకు మాత్రమే సాధ్యమని చెప్పారు. రోగంతో బాధపడుతున్న సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకోని ఈ సమాజంలో నర్సులు చేసే ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ నాయకులు శ్రీనివాస్ రాథోడ్, రామలక్ష్మి , తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు జూపల్లి రాజేందర్ అపోలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తులసి సుజాత నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉత్తమ నర్సులను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేశారు.