శిల్పారామంలో శ్రీగురు నృత్యాలయం మణికొండ శ్రీమతి నల్లమోలు శ్రీలక్ష్మి వారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు అలరించాయి
ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫీ థియేటర్ లో శ్రీగురు నృత్యాలయం మణికొండ శ్రీమతి నల్లమోలు శ్రీలక్ష్మి నేతృత్వంలో వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్యప్రదర్శన ఎంతగానో అలరించింది.
ప్రదర్శనలో భాగంగా శ్రీ విఘ్నరాజాం భజే, గణేష పుష్పాంజలి, బ్రహ్మాంజలి, హనుమ చాలీసా, మూషిక వాహన, శివాష్టకం, జతిస్వరం, కామాక్షిస్తుతి, కొలువైతివారంగాసాయి, అన్నమయ్య కీర్తనలు, హిందోళ థిల్లాన అంశాలను కళాకారులు ఆద్య, ఆరాదిక, ఆశ్రీత, దీపికా, రుషిక, కృతిక, కుందన, జయా, పూజ, తన్య, సౌమ్య, శ్రేయ, తన్వి, ఉమిక, వైష్ణవి, యశస్విని మొదలైన వారు ప్రదర్శించారు. కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.