శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా 2018 “
శిల్పారామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేలా 2018 నేటితో ముగిసింది.
చివరి రోజు కావడం వల్ల సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేషనల్ అవార్డీస్ నారాయణ్, శ్రీమతి కావ్య, బషిరున్ భాను, ధనిరామ్ సోని, షిండే శ్రీరాములు, పన్నీర్ సెల్వం గార్లకి శిల్పారామం జనరల్ మేనేజర్ కిషన్ దాస్ సన్మానించారు.
వచ్చిన సందర్శకులు ఆహ్లాదం కొరకు బోటింగ్, బ్యాటరీ కార్, ఎడ్లబండి సవరిని ఎక్కి సంతోషించారు. పిల్లలు పెద్దలు చక్కని ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరి ఆనందించారు. మేళ కొరకు ఏర్పాటుచేసిన స్పెషల్ లైటింగ్ అబ్బురపరిచింది.
ఈరోజు సాయంత్రం కుమారి నేహా మరియు బృందం భరతనాట్య ప్రదర్శన, కర్ణాటక రాష్ట్ర జ్ఞాపడ నృత్యం ” డొల్లుకునిత “, ఛత్తీస్గఢ్ జానపదం ” గుడుంబాజా “, తెలంగాణ రాష్ట్ర జానపద నృత్యం ” కొమ్ము కోయ ” ఎంతగానో అలరించాయి.