తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ముగిసిన డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి (తెలంగాణ కవితా సప్తాహం) వేడుకలు
Contents
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ముగిసిన డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి (తెలంగాణ కవితా సప్తాహం) వేడుకలుమహాకవులు డా. దాశరధి కృష్ణమాచార్య, డా.సి.నారాయణ రెడ్డి గారల జయంతి వేడుకలు తెలంగాణ కవితా సప్తాహంలో చివరి రోజు (29.07.19, సోమవారం) కార్యక్రమానికి తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి సభాధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేసారు.మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ గర్వించదగ్గ సాహితీవేత్త డా. సి. నారాయణ రెడ్డి అని అన్నారు. తెలుగు బాషా, తెలంగాణ చైతన్యాన్ని ప్రపంచ నలుమూలలు వ్యాపింపచేసి, ఎన్నో గొప్ప సాహిత్య రచనలు, సినీ గేయ రచనలు చేసి ప్రజల హృదయాలను గెల్చుకున్న మహోన్నత వ్యక్తి సినారె అని అన్నారు. తెలంగాణకు దాశరధి, కాళోజిలు రెండు కళ్ళైతే సినారె మూడో కన్ను అని అభివర్ణించారు. అలాగే దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న ఒక్క వాక్యంతో తెలంగాణ జాతినంతా ఒక్క తాటిపై చేర్చారని అభివర్ణించారు.ప్రత్యేక ప్రసంగంలో గురిజాల రామశేషయ్య మహాకవి సి.నా.రె. బహుముఖ ప్రస్థానం అనే అంశంపై మాట్లాడారు. డా. సి. నారాయణ రెడ్డి సాహితీ వ్యక్తిత్వాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఇంత ఘనంగా వారం రోజుల పాటు డా. దాశరథి కృష్ణమాచార్య, డా. సి. నారాయణరెడ్డి గారల జయంతి వేడుకలను నిర్వహించడం గర్వించదగినదని అన్నారు.ఏనుగు నరసింహ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రత కవులకు గొప్ప గౌరవం దక్కిందని అన్నారు. సాహిత్య ఆకాడమి గత సంవత్సరం నుండి తెలంగాణ కవితా సప్తాహం పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు.చివరి రోజు తెలంగాణ కవితా సప్తాహం కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొని వారి కవితలను చదివి వినిపించారు.సంబరాజు రవిప్రకాష్ రావు చక్కటి వాఖ్యానం చేసి, చివరిగా తన కవితను వినిపించి అక్కటుకున్నారు.గత ఎనిమిది రోజులుగా తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు ఎంతో ఉత్స్యాహంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు సాహీతీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.