Reading:24x7onlinenews.com (28.08.19): రెవిన్యూ వ్యవస్థపై విలువైన పుస్తకం – ” తెలుగు రాష్ట్రాల రెవిన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు ” పుస్తకావిష్కరణలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉద్గాటన
24x7onlinenews.com (28.08.19): రెవిన్యూ వ్యవస్థపై విలువైన పుస్తకం – ” తెలుగు రాష్ట్రాల రెవిన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు ” పుస్తకావిష్కరణలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉద్గాటన
రెవెన్యూ వ్యవస్థపై విలువైన పుస్తకం – ” తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు ” పుస్తకావిష్కరణలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉద్గాటన
రెవెన్యూ వ్యవస్థలో కాలానుగుణమైన మార్పులు రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోధాకుమార్ అన్నారు. బుధవారం నాడు టన క్యాంపు కార్యాలయంలో ఏనుగు నరసింహారెడ్డి రాసిన ” తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ – నిన్న, నేడు, రేపు “అన్న పుస్తకాన్ని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం. బాలాచారితో కలసి బోయినపల్లి వినోధాకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థపై సర్వత్రా చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ పుస్తకం అవసరం ఎంతో ఉందన్నారు. ఏనుగు నరసింహారెడ్డి రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ అనుభవపూర్వకంగా ఈ పుస్తకాన్ని రాశారని అన్నారు. ఈ శాఖలో సమూలమైన సంస్కరణలకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి పుస్తకం రావటం సంతోషంగా ఉందన్నారు.
ప్రజలతో నిరంతరం సంబంధాలను కలిగి ఉండేది రెవెన్యూ శాఖ అని ప్రభుత్వం ఇచ్చే షెములను ప్రజలకు అందచేసేది రెవిన్యూ శాఖ అని అయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. కరువునూ, సుభిక్షాన్ని, వరదాలనూ, అశాంతిని ఈ శాఖే సమన్వయం చేస్తుందన్నారు. ఎన్నికలను నిర్వహిస్తుందని, జనాభా గణనచేస్తుందని, ఆదాయ, కుల, స్థానిక తదితర సర్టిఫికెట్లు ఇస్తోందని పేర్కొన్నారు. 1985 కంటే ముందు భూమిశిస్తు వసూలు చేసే శాఖాగా దీనికి పేరుండేదని ఎన్టీఆర్ భూమిశిస్తును రద్దుచేయడంతో ప్రస్తుతం ఈ శాఖ సాధారణ పరిపాలనశాఖగా మారిందన్నారు. అదే సందర్భంలో ఎన్నో విమర్శలను, అసహానాన్ని కూడా ఈ శాఖ ఎదుర్కొంటుందని ప్రస్తుత స్థితిని అయన గుర్తుచేశారు. దానికి కారణాలను ఏమిటి? దాని చరిత్ర ఏమిటి? దాన్ని ఎలా ప్రజలకు ప్రియమైన శాఖగా మార్చగలమనే తపనతో ఈ గ్రంధం ఏనుగు నరసింహారెడ్డీ రాశారని తానూ భావిస్తున్నానని వినోధాకుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సెల్ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం.బాలాచారి, పుస్తక రచయిత ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.