శిల్పారామంలో అలరించిన కూచిపూడి మరియు కథక్ ప్రదర్శనలు
శిల్పారామంలో ఈ రోజు కూచిపూడి మరియు కథక్ ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
చెన్నైకి చెందిన కూచిపూడి కళాకారిణి కుమారి ఆశ్రిత కేశవ్ తన ప్రదర్శనతో సందర్శకులని అలరించింది. మొదటగా సరస్వతీదేవి ప్రార్ధనతో ప్రారంభించి, ముత్తుస్వామి దీక్షితార్ కృతితో చక్కని అభినయపూర్వకంగా నర్తించింది. తరువాత నారాయణ తీర్థాల తరంగం “జయ జయ మర్దే” లో మహిసాసుర రాక్షస సంహార ఘట్టాన్ని ప్రదర్శించింది. చివరిగా పురందరదాసు రచించిన ఆరతి కృతితో ముగించింది. ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.
నృత్యం కథక్ కళాక్షేత్ర డా. చంద్రతప సహరాయ్ గారి శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. సరస్వతి వందన, గణేశ వందన, శివ వందన, తారాణా, రామస్తుతి అంశాలను దాదాపు 70 మంది కళాకారులు పాల్గొని అలరించారు.