శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో….. కుమారి సంజన, శ్రీమతి రష్మీ సచ్చిదానంద ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫీ థియేటర్ లో భరత నాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి సంజన తన ప్రదర్శనలో ప్రభో గణపతే, మధురాష్ట్రకం, జగద్దొధారణ అంశాలను ప్రదర్శించారు.
శ్రీ దత్త నాట్యాలయ శ్రీమతి లక్ష్మి సచ్చిదానంద నేతృత్వంలో ” గురువే నమః ” భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఇందులో భాగంగా మల్లారి, మూషిక వాహన, గణేశస్తుతి, అలరిపు, రంజని మాల, కావడి, జావళి, థిల్లాన అంశాలను శ్రీమతి రష్మి, మోనిష, సిరి, అయిషి, అక్షయ, అంజలి, సంజన మొదలైనవారు ప్రదర్శించారు.