శిల్పారామంలో జానపద ప్రదర్శనలు, విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాతో సందడి సందడిగా ‘కనుమ’ వేడుకలు
శిల్పారామంలో నిన్న సంక్రాంతి, ఈ రోజు కనుమ పండుగ సందర్బంగా ప్రజలు అనూహ్యంగా విచ్చేసి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.
ఉదయం నుండి జంగందేవరలు, హరిదాసులు, బుడబుక్కల వారు, ఎరుకలసాని, పిట్టలదొర, గంగిరెద్దుల విన్యాసాలు, కొమ్మ దాసరులు సందడిలో సందర్శకులు కూడా పాల్గొని వాళ్ళతో సెల్ఫీలు దిగి సంతోషపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాల ప్రదర్శనలు విలేజ్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాయంత్రం శ్రీమతి తాడేపల్లి సుబ్బలక్ష్మి బృందం, శ్రీవాసుదేవరావు బృందం ఆలపించిన సంక్రాంతి, భోగి, గొబ్బిళ్ళ పాటలు ఎంతగానో అలరించాయి.
ఈ రోజు కనుమ సందర్భంగా శ్రీవాసుదేవరావు బృందం సంక్రాంతి పాటలు, శంకరి స్కూల్ అఫ్ డాన్స్ వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అక్కటుకున్నాయి.
సంక్రాంతి సందర్బంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.