శ్రీరామనవమి పురస్కరించుకొని శిల్పారామంలో ఆక్కటుకున్న” త్యాగరాజ రామాయణం” మరియు నృత్య ప్రదర్శనలు
శ్రీరామనవమి పురస్కరించుకొని శిల్పారామం ఆంఫి థియేటర్ లో భారతాంజలి, బెంగళూరువారు సమర్పించు ” త్యాగరాజ రామాయణం” సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది.
గురువు శ్రీమతి సీతాగురుప్రసాద్ నేతృత్వంలో వారి శిష్య బృందం త్యాగరాజు రచించిన రామాయణ కృతులతో కూడిన రామాయణ కావ్యంలోని ఘట్టాలు శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, సీతాపహరణం, శబరి మోక్షం, సేతు బంధనం, రామ రావణ యుద్ధం, మహా పట్టాభిషేకం వృత్తాంశాలను కళ్ళకు కట్టినట్లు అభినయించారు. వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను కూడా అభినయించారు.
శ్రీ మల్లేశ్వరి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ డా. హిమబిందు నరేంద్ర శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. గణపతి స్తుతి, ఒకపరి కొకపరి, ముద్దుగారే యశోద, స్వాగతం కృష్ణ, ఇదిగో భద్రాది మొదలైన అంశాలపై ప్రదర్శించారు.