తెలంగాణ రాష్ట్రస్థాయి సంగీత, నృత్య, వాయిద్య విభాగాల పోటీల వాల్ పోస్టర్ (గోడ పత్రిక) ను సచివాలయంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు
Contents
తెలంగాణ రాష్ట్రస్థాయి సంగీత, నృత్య, వాయిద్య విభాగాల పోటీల వాల్ పోస్టర్ (గోడ పత్రిక) ను సచివాలయంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారుశ్రీ సమర్ధ సద్గురు త్యాగరాజ కర్ణాటక సంగీత గురుకుల సన్నాయి శిక్షణాలయం ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించు సంగీత విభాగ పోటీలను చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ లో నాద స్వరం, డోలు, కూచిపూడి, భరత నాట్యం, భక్తి సంగీతం, జనపద సంగీతం, సినీ సంగీతం లపై పోటీలను ఈ నెల 25 న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నామని నిర్వాహకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని కులాలకు, చేతివృత్తు లకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని కులాల చేతివృత్తుల వారికి విద్య, వైద్యంతో పాటు ఆర్ధికంగా నిలదొక్కుకునే విధంగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రస్థాయి సంగీత, నృత్య, వాయిద్య కళాకారుల సంఘం నాయకులు ఎ.ఎం. తులసి దాస్, ఎం. రాము, నాగరాజు, ఎం.వి. సుబ్బయ్య, ఎ.ఎం. బీచుపల్లి, ఎం. గిరిబాబు పాల్గొన్నారు.
శ్రీ సమర్ధ సద్గురు త్యాగరాజ కర్ణాటక సంగీత గురుకుల సన్నాయి శిక్షణాలయం ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించు సంగీత విభాగ పోటీలను చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ లో నాద స్వరం, డోలు, కూచిపూడి, భరత నాట్యం, భక్తి సంగీతం, జనపద సంగీతం, సినీ సంగీతం లపై పోటీలను ఈ నెల 25 న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నామని నిర్వాహకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని కులాలకు, చేతివృత్తు లకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని కులాల చేతివృత్తుల వారికి విద్య, వైద్యంతో పాటు ఆర్ధికంగా నిలదొక్కుకునే విధంగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రస్థాయి సంగీత, నృత్య, వాయిద్య కళాకారుల సంఘం నాయకులు ఎ.ఎం. తులసి దాస్, ఎం. రాము, నాగరాజు, ఎం.వి. సుబ్బయ్య, ఎ.ఎం. బీచుపల్లి, ఎం. గిరిబాబు పాల్గొన్నారు.