దొరసాని దర్శకుడు కేవిఆర్ మహేంద్ర చిత్రపటం ఆవిష్కరణ; పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా తెలంగాణ యువ దర్శకులను తెలుగు సినిమారంగానికి అందించబోతున్నాం – మామిడి హరికృష్ణ
తెలంగాణలోని యంగ్ ఫిలిం మేకర్స్ కు ఫిలిం మేకింగ్ పై అవగాహన కలిగించడంకోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటుచేసిన సినివారంలో దొరసాని దర్శకుడు కేవిఆర్ మహేంద్ర చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఎన్ఆర్ఐ సుధీర్ జలగం, సినీ రచయిత యశ్ పాల్, దర్శకుడు ఆర్. వినోద్ కుమార్ పాల్గొని మహేంద్ర చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా 15మంది తెలంగాణ యువ దర్శకులను తెలుగు సినిమారంగానికి అందించబోతున్నామని, దొరసాని సినిమాతో ఈ వేదిక నుండి తొలి దర్శకుడుగా నిలిచిన కేవిఆర్ మహేంద్ర చిత్రపటాన్ని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ హాల్ ఆఫ్ ఫేం లో ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.
ఇన్ఫార్మల్ ఫిలిం ఇన్సిట్యూట్ గా మారిన ఈ వేదికలో ఫిలిం మేకింగ్ కి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన దొరసాని సినిమా దర్శకుడు మహేంద్ర తీసిన నిశీధి షార్ట్ ఫిల్మ్ కూడా ఇదే వేదికపై ప్రదర్శించబడిందని అన్నారు. వివిధ అంతర్జాతీయ వేదికల్లో హాల్ ఆఫ్ ఫేం పేరుతో ప్రముఖుల చిత్రపటాలు ఉంటాయని, అదేకోవలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ తో అనుబంధం ఉన్న యువ దర్శకుల ఫోటోలను ఏర్పాటుచేయడంకోసం హాల్ ఆఫ్ ఫేంను రూపొందించామని, ఇదే స్ఫూర్తితో యంగ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాలను రూపొందించాలని పేర్కొంటూ మహేంద్రకు అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులు పాల్గొన్నారు.
(Courtesy: FB-Cinivaram సినివారం)
Contents
దొరసాని దర్శకుడు కేవిఆర్ మహేంద్ర చిత్రపటం ఆవిష్కరణ; పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా తెలంగాణ యువ దర్శకులను తెలుగు సినిమారంగానికి అందించబోతున్నాం – మామిడి హరికృష్ణతెలంగాణలోని యంగ్ ఫిలిం మేకర్స్ కు ఫిలిం మేకింగ్ పై అవగాహన కలిగించడంకోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటుచేసిన సినివారంలో దొరసాని దర్శకుడు కేవిఆర్ మహేంద్ర చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఎన్ఆర్ఐ సుధీర్ జలగం, సినీ రచయిత యశ్ పాల్, దర్శకుడు ఆర్. వినోద్ కుమార్ పాల్గొని మహేంద్ర చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగామామిడి హరికృష్ణ మాట్లాడుతూ… పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా 15మంది తెలంగాణ యువ దర్శకులను తెలుగు సినిమారంగానికి అందించబోతున్నామని, దొరసాని సినిమాతో ఈ వేదిక నుండి తొలి దర్శకుడుగా నిలిచిన కేవిఆర్ మహేంద్ర చిత్రపటాన్ని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ హాల్ ఆఫ్ ఫేం లో ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.ఇన్ఫార్మల్ ఫిలిం ఇన్సిట్యూట్ గా మారిన ఈ వేదికలో ఫిలిం మేకింగ్ కి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన దొరసాని సినిమా దర్శకుడు మహేంద్ర తీసిన నిశీధి షార్ట్ ఫిల్మ్ కూడా ఇదే వేదికపై ప్రదర్శించబడిందని అన్నారు. వివిధ అంతర్జాతీయ వేదికల్లో హాల్ ఆఫ్ ఫేం పేరుతో ప్రముఖుల చిత్రపటాలు ఉంటాయని, అదేకోవలో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ తో అనుబంధం ఉన్న యువ దర్శకుల ఫోటోలను ఏర్పాటుచేయడంకోసం హాల్ ఆఫ్ ఫేంను రూపొందించామని, ఇదే స్ఫూర్తితో యంగ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాలను రూపొందించాలని పేర్కొంటూ మహేంద్రకు అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఫిలిం మేకర్స్, సినీప్రియులు పాల్గొన్నారు.