యాదాద్రిలో త్వరలో మహా సుదర్శనయాగాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. మంగళవారం ముచ్చింతల్లో ఆశ్రమానికి వెళ్లి త్రిదండి చినజీయర్స్వామితో ఈ యాగం నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను చినజీయర్స్వామి ఆశీర్వదించారు. శాలువాతో సత్కరించి, రామానుజులవారి విగ్రహాన్ని బహూకరించారు.