శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి అమ్మవారికి పల్లకీసేవ
Pallaki Seva performed to Sri Brahmarambadevi Ammavaru at Srisailam Temple
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం ఆదివారం మరియు మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (24.05.2020) రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడ్డాయి. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించబడింది. ఈ ఉత్సవములో శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసే పల్లకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడింది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా లాక్ డౌన్ కూడా అమలు చేయబడుతోంది. కాబట్టి అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా ఈ పల్లకీ సేవను అర్చకులు, వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.