ఎల్బీ స్టేడియంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు -పాల్గొన్నముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
-ఎల్బీ స్టేడియంలో ఘనంగా అధికారిక వేడుకలు
-దేశంలో క్రిస్మస్ను అధికారికంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ఒక్కటే
-రాష్ర్టానికే గర్వకారణంగా క్రిస్టియన్ భవన్ను నిర్మిస్తాం
-క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకుముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదరసోదరీమణులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.