తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లు ను పరిశీలించిన రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.
రాష్ట్ర అవతరణ దినోత్సవాల సన్నాహక ఏర్పాట్లు పరిశీలనలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్య లు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ను చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న పబ్లిక్ గార్డెన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందన్నారు. గత 70 ఏళ్లలో సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యం గా ఆపర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో గత ఐదు సంవత్సరాలలో అనేక ఘన విజయాలు సాధించిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి సాధించిందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం గా రూపొందించిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించుకున్నాం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
పబ్లిక్ గార్డెన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు ను ఘనంగా ఏర్పాటు చేయాలని అధికారులను అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్స్ లో సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. పబ్లిక్ గార్డెన్స్ కు అనుబంధంగా ఉన్న జూబ్లీ హాల్ లో కవి సమ్మేళనం ను నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు.