నాగార్జున సాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్టు లో ఏర్పాటు చేసిన తథాగత గౌతమ బుద్ధ 2563 వ బుద్ధ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.
బుద్ధ జయంతి ని పురస్కరించుకుని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుద్ధవనం లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహులయ్య, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పన్యాల భూపతి రెడ్డి. బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ డా. కె. రామచంద్ర మూర్తి, పూణే యూనివర్సిటీ ఆచార్యులు మహేష్ దేవుకార్, శ్రీలంక పార్లమెంట్ సభ్యులు Ven.Athuraliye Dorjee, న్యూఢిల్లీ లోని టిబెట్ హౌస్ కు చెందిన Ven. Geshe pema Dorjee లు పాల్గొన్నారు.
బుద్ధ జయంతి ని పురస్కరించుకుని ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నాగార్జున సాగర్ లోని బుద్ధవనం విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో బుద్ధవనం అభివృద్ధి కి 25 కోట్లు కేటాయించారన్నారు. క్రీస్తు పూర్వమే తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బుద్ధవనం కు అనుబంధంగా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఏర్పాటు కు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
బాదంకుర్తి, ఫణిగిరి, కొండాపూర్, కోటి లింగాల లతో పాటు కృష్ణ – గోదావరి నదుల మధ్య ఉన్న 50 కి పైగా ఉన్న బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో బుద్ధ చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఎక్కడైనా లభించిన, పురావస్తు శాఖ వారి తవ్వకాలలో బయటబడిన చరిత్ర, విలువైన సంపద ను బుద్ధ వనంలో భద్రపరుచాలని సూచించారు.
తెలంగాణ లో ఉన్న బుద్ధిజం కు తగినంత ప్రచారం నిర్వహించి బుద్దిస్టులను, దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో ఉన్న చారిత్రక, వారసత్వ సంపదల పరిరక్షణను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బుద్ధ క్షేత్రాలను అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నాగార్జున సాగర్ లోని బుద్ధవనం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.