18వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు. గన్ ఫౌండ్రీ లోని SBI కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో SLBC ప్రెసిడెంట్ జె. స్వామినాధన్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పొచారం …..
మే 10 నుండి రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభం, మొత్తం 58 లక్షల మంది రైతులకు చెక్కులు అందవేత.
దేశంలో రైతులకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 సమకూరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఈ పథకం విజయం సాదించే విదంగా చర్యలు తీసుకోవాలని మీ బ్యాంకుల అన్ని స్థాయిలోని అధికారులకు సూచనలు ఆదేశాలు పంపండి.
క్షేత్ర స్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి.
మీ బ్యాంకుల అధికారులు కూడా జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి.
చెక్కులను క్లీయర్ చేస్తున్నప్పుడు అన్ని బ్యాంకులు చార్జీలను యూనిఫామ్ గా వసూలు చేయాలి.
రైతుబంధు చెక్కులను మార్చుకోవడానికి వచ్చే రైతులకు క్షేత్ర స్థాయిలోని అధికారులకు, సిబ్బంది సహకరించాలి.
రైతుబంధు పథకంకు అవసరమైన డబ్బులు రెడిగా ఉన్నాయి.
రాష్ట్రంలో 62 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
కావున రైతులను ఇబ్బంది పెట్టకుండా బ్యాంకుల అధికారులు సహకరించాలి.
ఈ ధనం రైతులు పెట్టుబడికై వాడేవిదంగా చూడాలి.
వ్యవసాయ రుణాల పంపిణీలో 2017-18 లో బ్యాంకులు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.
కొన్ని బ్యాంకులు మంచి పనితీరు కనబరచగా, మరికొన్ని నిరుత్సాహ పనితీరులో ఉన్నాయి.
2018-19లో అన్ని బ్యాంకులు 100 శాతం లక్ష్యం చేరుకోవాలి.
వ్యవసాయ, అనుబంధం శాఖలకు సంబంధించి వచ్చే ఏడాదికి ప్రణాళికలు రూపొందించిడానికి త్వరలో మరో సమావేశం నిర్వహించాలి.