వియత్నంలో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో మన దేశం నుండి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణు బృందంను ప్రశంసించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
వియత్నంలో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో భారతదేశం తరుపున తెలంగాణ కు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణు బృందం ప్రదర్శన నిర్వహించి ప్రముఖ మెజిషియన్ల ప్రశంసలు పొందినందుకు సచివాలయంలో ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో అభినందించారు.
ఈ ఫెస్టివల్ లో తెలుగు యూనివర్సిటీ మొదటి బ్యాచ్ కు చెందిన C. నరేష్ ఈ మ్యాజిక్ ఫెస్టివల్ లో మంచి ప్రతిభను కనబరిచి ప్రముఖ మెజిషియన్లు ప్రసoశలు పొందారని మంత్రికి వివరించారు.అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో 150 మంది ప్రముఖ మెజిషియన్ లు పాల్గొన్నా ఈ ఫెస్టివల్ లో మన దేశం నుండి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణు బృందం ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.