హైదరాబాద్ ఎల్ బి నగర్ నాయకుల గుట్ట, నందనవనం ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
ఆయా విభాగాలను పరిశీలించిన మంత్రి. ఇప్పటికే 18 బస్తి దవాఖానాలు ప్రారంభించాం. ఈ సంఖ్య త్వరలో 40 కి చేరుతుంది. హైదరాబాద్ మహా నగరంలో మొత్తం 1000 దవాఖానాలు ప్రారంభించాలనేది లక్ష్యం. బస్తి దవాఖానాలతో బస్తీ ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఆన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. వైద్య రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పరుస్తున్నాం. అనేక సదుపాయలు కల్పిస్తున్నాం. నందనవనం కు 30 పడకల హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తాం. కావాల్సిన స్థలం చూపిస్తే వంటనే పనులు మొదలు పెడతాం.
ఈ కార్యక్రమాల్లో ఎంపీ మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బస్తి ప్రజలు పాల్గొన్నారు.