హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభమైన ‘మైనింగ్ టూడే 2018’ ఇంటర్నెషనల్ కన్ఫరెన్స్
హాజరైన గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి తోమర్, మంత్రి కేటిఆర్
సదస్సు నాలుగురోజుల పాటు జరుగుతుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణఫ్రికాలతోపాటు మనదేశం నుంచి మైనింగ్ ప్రతినిధులు హాజరు….
ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపు తోపాటు మైనింగ్, అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలపై సదస్సుల్లో చర్చ …..
మైనింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా, ఫిక్కీ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మైనింగ్ కాన్ఫరెన్స్ కమ్ ఎక్సబిషన్…
తేది. 17.02.2018 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షలు శ్రీ ఎస్.సుబాష్ రెడ్డి , రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ , భారత మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ.కె.కోటారి, ఫిక్కి డైరెక్టర్ జనరల్ దిలిప్ చెనాయ్ , మైనింగ్ టుడే -2018 సమావేశం అధ్యక్షుడు శ్రీ సురేష్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.