నిర్మల్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయం, వీర హనుమాన్ దేవాలయ ప్రాంగణం, SRDG స్కూల్ లో మంత్రి మొక్కలు నాటారు.