సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా రాచకొండ సిపి మహేశ్ భాగవత్ మాట్లాడుతూ.. మహిళలు నిర్భయంగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా రాచకొండలో రెండు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అలాగే సరూర్నగర్, కుషాయిగూడ, భువనగిరి పోలీస్ స్టేషన్ లో మూడు మహిళ కౌన్సిలింగ్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేసి కాపురాలకు చెక్కబెట్టామని ఆయన అన్నారు. కుషాయిగూడలోని కౌన్సిలింగ్ సెంటర్ లో 50 శాతం ఫ్యామిలీ జంటలను కలిపామన్నారు. భార్యభర్తల గొడవపడి వచ్చిన వెంటనే కేస్ పెట్టకుండా మూడు సార్లు కౌన్సిలింగ్ చేసి వారిలో మార్పు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. ఎన్ఆర్ఐ పెళ్లిళ్లు బాగా కాంప్లికేటెడ్ అవుతున్నాయని ఆయన అన్నారు. వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం కష్టంగా ఉంటోందని అన్నారు. ఈమధ్యకాలంలో ఆల్కహాల్ వలన వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. పెళ్లి ఐన తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనేదానిమిద ప్రి మెడికల్ కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని ఆయన అన్నారు.