“ప్రపంచ తెలుగు మహాసభలు – 2017” భాగంగా రవీంద్ర భారతిలో ఈరోజు 25 లఘు చిత్రాల ప్రదర్శనలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రపంచ తెలుగు మహాసభలు – 2017″లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో “యువచిత్రోత్సవం”- ‘లఘు చిత్రాల పోటీ’ని నిర్వహించింది. ఈ పోటీలో 173 లఘు చిత్రాలు వచ్చాయి.
జ్యురీ వారు ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ప్రదర్శనకు ఎంపిక చేసిన లఘు చిత్రాలని నిన్న 20 లఘు చిత్రాల ప్రదర్శన చేయగా…
ఈరోజు 25 లఘు చిత్రాల ప్రదర్శన చేయడం జరిగింది. రేపు డిసెంబర్ 18న మధ్యాహ్నం 2:00 గంటలకు యువ చిత్రోత్సవం – లఘు చిత్రాల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేస్తారు. ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారు. డిసెంబర్ 19వరకు సినిమాల ప్రదర్శన ఉండును.
ఈరోజు ప్రదర్శనలో…
1. సినివారం లఘుచిత్రం : సినిమా మీద ప్రేమతో ఒక పల్లెటూరి అబ్బాయి పైసా ఖర్చు లేకుండా ఎలా సినిమా తీసాడో తెలిపే లఘుచిత్రం.
2. ఇష్టం-కష్టం లఘుచిత్రం:
భార్యాభర్తల జీవితంలో అన్యోన్యతల గురించి తెలిపే లఘుచిత్రం.
3. బలరాం లఘు చిత్రం:
అసలున్నాయో లేదో తెలియని గుప్త నిధుల కోసం సమయాన్ని, ఇతరుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఎలా కష్టాలు అనుభవించాడో తెలిపే లఘుచిత్రం.
4. తను రాదు, వీడు మారడు:
ముగ్గురి స్నేహితుల మధ్యన జరిగే ప్రేమ వ్యవహారమే ఈ లఘుచిత్ర వృత్తాంతం…
5. ఇదిగో అందుకోండి..నా శుభలేఖ:
సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలనుద్దేశించి ఒక పాప శ్రీకృష్ణుడే తన పతియని, శుభలేఖతో స్వామి వద్దకు వెళ్లి నివేదించుకునే లఘుచిత్రం
ఈ కార్యక్రమంలో ఔత్సాహిక సినిమా దర్శకులు సినీ ప్రేమికులు, తదితరులు పాల్గొన్నారు.