సంగారెడ్డి జిల్లా లో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 7.30 నిమిషాలకు పోలీస్ గ్రౌండ్స్, సంగారెడ్డి లో పరేడ్ కమాండర్ శ్రీ హరిలాల్ గారి ఆద్వర్యం లో స్మ్రితి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రంజ్ DIG శ్రీ శివశంకర్ రెడ్డి IPS గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం DIG గారు అమర వీరుల స్తూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. తరువాత ఇంచార్జ్ అడిషనల్ SP శ్రీ షేక్ లాల్ అహ్మద్ గారు, సంగారెడ్డి DSP తిరుపతన్న గారు, టౌన్ CI రామకృష్ణా రెడ్డి గారు, రూరల్ CI నరేందర్ గారు, ట్రాఫిక్ CI సంజయ్ కుమార్ గారు, SB SI దశరథ్ గారు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు అమర వీరుల స్తూపం వద్ద పువ్వులు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో DIG గారు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 వ తేదీన ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులలో ఉన్న సి.ఆర్.పి.ఎప్ SI కరమ్ సింగ్ గారి నాయకత్వం లోని 20 మంది భారత జవాన్లపై చైనా సైనిక దళాలు జరిపిన దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా 1960 అక్టోబర్ 21 వ తేదీన మొదటిసారిగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుండి సరాసరిగా (AVERAGE) ప్రతీ సంవత్సరం 500 మందికి పైగా పోలీసు అధికారులు వివిధ ప్రాంతాలలో దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ఈ సంవత్సరం 01-09-2016 నుండి 31-08-2017 వరకు దేశ వ్యాప్తంగా 383 మంది పోలీసులు దేశ ప్రజల రక్షణ కోసం ఉగ్రవాదులు,తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని, ఈ అమర వీరుల త్యాగాలను మనమందరం అనుక్షణం సంస్మరించుకుంటూనే దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆకాంక్షించారు.
అనంతరం సంగారెడ్డి DSP శ్రీ తిరుపతన్న గారు ఈ సంవత్సరం దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన 383 మంది పోలీస్ అమరవీరుల పేర్లు చదవడం జరిగింది. తరువాత DIG గారు సంగారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ అమర వీరుల కుటుంబాలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం చివరలో అమీన్పూర్ ASI బుచ్చయ్య గారు పోలీస్ అమర వీరులను స్మరిస్తూ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.