శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
తిరుమల డిసెంబర్ 17: తిరుమల శ్రీవారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గవర్నర్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నరసింహన్ దంపతులకు అర్చకులు, తితిదే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో గవర్నర్ను సత్కరించారు. ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.