శిల్పారామం హైదరాబాద్: Octave 2017 ఫెస్టివల్ సందర్బంగా ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్యాలు అలరించాయి
శిల్పారామం హైదరాబాద్ మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు వారు సంయుక్తంగా నిర్వహించు Octave Festival-2017 భారతదేశ ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అరుణాచల ప్రదేశ్ అడవులలో నివసించే అమ్మాయిలు, అబ్బాయి వాళ్ళ పండుగల సందర్భంగా అడవులలోనున్న జంతువులతో స్నేహం చేసే సందర్భములో నర్తించే నృత్యం “పఖు ఇటు” నృత్యం.
మణిపూర్ రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన నృత్యం,”ఖంభా తోయిభి జాగోయి” చక్కగా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చేసే నృత్యం, తమ జీవన సారధిని ఎంచుకొనే క్రమంలో చేసే నృత్యం.
జహాన్ జితాయి కమ్యూనిటీకి చెందిన అస్సాం రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరం రోజున సంబరాలలో చేసే నృత్యం, “ఖర్బీ నృత్యం”.
‘మమిత’ అంటే బియ్యం. పంట చేతికి వచ్చిన తర్వాత నిర్వహించే సంబరాలలో త్రిపుర రాష్ట్రం త్రిపురీ కమ్యూనిటీ ప్రజలు చేసే నృత్యం “మమిత నృత్యం”.
ప్రాచీన మరియు చారిత్రాత్మక నేపధ్యంలో చేసే నృత్యం, సింహలామ్ మణిపురీ నృత్యం. ‘బుగున్’ తెగ ప్రజలు తమ సంతోషాన్ని వెలిబుచ్చే సందర్భంలో చేసే నృత్యం, “గసోస్యో” అరుణాచల ప్రదేశ్ నృత్యం. నాగాలాండ్ మరియు సిక్కిం రాష్ట్ర జానపద నృత్యాలు కూడా ఎంతగానో అలరించాయి.