శిల్పారామం మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు సంయుక్తంగా నిర్వహించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చివరిరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ బెంగళూరు కథక్ గురువులు శ్రీ మైసూర్ బి. నాగరాజు గారి శిష్య బృందం, కుమారి అక్షిత, కుమారి అషిత, కుమారి క్షమిత, శ్రీమతి రక్ష, కుమారి యశస్వినిలు గణపతి మూర్తే, మరియు ఫాలనేత్ర, తుమ్మరీ, తరానా అంశాలను ప్రదర్శించారు.
డప్పు నృత్యం శ్రీ అందసి నారాయణ బృందం, ఒగ్గుడోలు శ్రీ వెంకటేశ్వర రావు బృందం, మధురీ కుమారి సరస్వతీ బృందం, లంబాడి నృత్యం శ్రీమతి వెంకట లక్ష్మి బృందం, గుస్సాడీ డా. మల్లేష్ బృందం ప్రదర్శించారు.
కళాకారులందరినీ, శిల్పారామంలో ప్రత్యేకంగా నేసిన శాలువాలతో సన్మానించారు.