శిల్పారామం మరియు డెవలప్మెంట్ కమీషనర్ ‘హ్యాండీక్రాఫ్ట్స్’ న్యూఢిల్లీ వారు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు “ క్రాఫ్ట్ అవేర్ నెస్ ప్రోగ్రామ్” శిల్పారామం ఎథ్నిక్ హాల్లో నిర్వహించడం జరిగింది. దాదాపుగా వంద మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. గత మూడు రోజుల నుండీ శిల్పారామం ఆధ్వర్యంలో శ్రీ అంజయ్య గారు, డిప్యూటీ జి.ఎమ్, శ్రీ సూర్యనారాయణ గారు, డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ (రిటైర్డ్), శ్రీమతి యశస్వినీ ఆనంద గారు, ప్రొఫెసర్, ఎన్.ఐ.ఎఫ్.టి, భారతదేశములో వివిధ రాష్ట్రాలలో ఉన్న హస్తకళల గురించి వివరించి సందేహాలను నివృత్తి చేశారు.