వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫీథియేటర్ లో భరతనాట్యం మరియు కధక్ నృత్యాలు ఎంతగానో అలరించాయి.
గుజరాత్ అహ్మదాబాద్ లో నేర్చుకున్నభరతనాట్య కళాకారిణి కుమారి జుగును కిరణ్ ఖఫాడియా భరతనాట్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. పుష్పాంజలి, పదం, జావళి, త్యాగరాయ కీర్తన, ధిల్లాన అంశాలను ప్రదర్శించారు.
ప్రముఖ కధక్ కళాకారులు శ్రీలక్ష్మినారాయణ జేనా బెంగుళూరు ప్రదర్శన ఎంతగానో అలరించింది. కధక్ నృత్యం లో చెప్పుకోదగినది పదవిన్యాసం, తాళ లయ మిళితమైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ఫలనేత్ర హర పినాకి సూరదాసు భజనే మరియు ఆనంద తాండవ అంశాలను ప్రదర్శించారు.
శ్రీవారి పాదాలు భరతనాట్య డాన్స్ అకాడమి శ్రీమతి రమదేవి గారి బృందం చే భరతనాట్య ప్రదర్శన పలువురి ప్రశంసలు పొందారు. గణేశ పంచరత్న, పుష్పాంజలి, సరస్వతి శ్లోకం, భు: శంభో:, మరియు వర్ణం అంశాలను శ్రీమతి రమాదేవి, రోహిత, దుర్గ, శ్రిత, లక్ష్య, శ్రీమయి మొదలగువారు ప్రదర్శించారు.