“భారతీయ సినిమాలో శాస్త్రీయనృత్యం” అనే సదస్సు లో ప్రముఖ నర్తకి, బాహుబలి ఫేమ్ శ్రీమతి అశ్రిత, సప్తపది హీరోయిన్ శ్రీమతి సబిత ప్రసంగం
శిల్పారామం మరియు “నాట్యమిత్రం” డా. హిమబిందు కనోజ్ మరియు బృందము సంయుక్తంగా నిర్వహించు “భారతీయ సినిమాలో శాస్త్రీయనృత్యం” అనే సదస్సు ప్రముఖ నర్తకి, బాహుబలి ఫేమ్ శ్రీమతి అశ్రిత, సప్తపది హీరోయిన్ శ్రీమతి సబిత గారు, ప్రముఖ గురువులు శ్రీ సాంబశివ గారు, ప్రొఫెసర్ యు.ఒ.హెచ్ శ్రీమతి అనురాధ గారు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రధాన వక్త శ్రీమతి సబిత గారు (సప్తపది ఫేమ్), “భారతీయ సినిమాలు మరియు శాస్త్రీయనృత్యం” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీమతి కాత్యాయనీ (నృత్య పాఠశాల) గారు “ఫ్రమ్ రస్టిక్ స్టేజెస్ టు డస్టీ స్టూడియోస్” అనే అంశంపై ప్రసంగించారు. అలనాటి శాస్త్రీయ నృత్య కళాకారులు సతారదేవి, పద్మిని, వైజయంతిమాల, ఉదయ్ శంకర్ మొదలైనవారి ప్రదర్శనల వీడియో క్లిప్పింగులను చూపించి, వారు పడ్డ కష్టాల గురించి చర్చించారు.
అతిథులుగా విచ్చేసిన శ్రీమతి సబిత, శ్రీమతి ఆశ్రిత, కుమారి కాత్యాయని గంటి గారిని నాట్యమిత్రం తరఫున శ్రీమతి హిమబిందు కనోజ్ గారు సత్కరించారు.