ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫీథియేటర్ లో కర్ణాటక గాత్రకచేరి మరియు కూచిపూడి నృత్యాలు ఎంతగానో అలరించాయి.
కుమారి శృతి బృందంచే కర్ణాటక గాత్రకచేరి అలరించింది. త్యాగరాజకృతులు, స్వరాలాపనలు మొదలైనవి ఆకట్టుకున్నాయి. వీరికి శ్రీ దత్తాత్రేయ గారు వేణువు పై , శ్రీ రాజగోపాల చారి గారు మృదంగ సహకారం అందించారు.
కుమారి శ్రీదేవి నంబూద్రి గారి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గణేశ వందన మొదలగు అంశాలను ప్రదర్శించారు.
కుమారి వసుమతి గారి బృందంచే వినాయక వందనం, ముద్దుగారే యశోద, ప్రహల్లాద శబ్దం, దశావతార శబ్దం, భామా కలాపం మరియు మురళి మనోహర అంశాలను ప్రదర్శించారు.