వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో భరత నాట్యం, మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగళూరు కళాకారిణి కుమారి మానస శివకుమార్ గారు పుష్పాంజలి, ప్రభో గణపతే, కామాక్షి కృతి, పొగడితిరో రంగ, మరియు నేత్రండి నేరటిలే అంశాలను భరతనాట్య పద్ధతిలో నర్తించారు.
అట్లాంటా (జిఎ), యుఎస్ లో స్థిరపడిన హైదరాబాద్ కూచిపూడి కళాకారిణి శ్రీమతి పుష్యమి లంక గారు తన ప్రదర్శనలో, భుః శంభో, పలుకుతేనెల తల్లి, మరియు కృష్ణం కలయ సఖి సుందరం అంశాలను ప్రదర్శించారు.
హైదరాబాద్ కూచిపూడి కళాకారిణి కుమారి లంక వైష్ణవి భామా కలాపం, అష్టపది, ఆనంద తాండవం అంశాలను ప్రదర్శించారు.