శిల్పారామంలో ఆదివారం ఉదయం, సాయంత్రం జరిగిన రెండు సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు మరియు కీర్తనలు 18.11.18
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా స్వర భారతి ఫౌండేషన్ వారి శిష్య బృందంచే కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
ఘం గణపతయే, బ్రహ్మాంజలి, గజాననం, శారదా స్తుతి, అంశాలను కూచిపూడి నిత్య.. శైలిలో పుష్పాంజలి, నర్తన గణపత్తిం, థిల్లాన, అలరిపు అంశాలను భరత నాట్య శైలిలో ప్రదర్శించారు.
ఉదయం 10 గంటలకు భారతీయ కళ సంస్కృతి వారి ఆధ్వర్యంలో సంగీతరాధన నిర్వహించడం జరిగింది. వాగ్గేయకారులు శ్రీ శ్యామ శాస్త్రి గారి కీర్తనలు ఆలపించారు. కూచిపూడి నృత్యంశాలలో “నవదుర్గ” అంశం ఎంతగానో ఆకట్టుకుంది.